Home » Andhra Pradesh » Vizianagaram
పట్టణ శివారులోని గిజబ కాలనీ సమీపంలో ఉన్న జంఝావతి కాలువలో ఆదివా రం ఉదయం మృతశిశువు కనిపించడంతో స్థానికులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంటింటికీ తాగునీరు సరఫరా జరిగే పైపులైన్లు మరమ్మతులకు గురయ్యాయి.
జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల గొంతెండుతోంది. అంతటా దాహం కేకలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా వర్షాలు కురవకపోవడంతో ‘మన్యం’లో చాలాచోట్ల భూగర్భ జలాలు, నదులు, చెరువుల్లో అడుగంటాయి. అనేకచోట్ల బోర్లు మొరాయించాయి. రక్షిత నీటి పథకాలు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో జిల్లావాసులు తాగునీటికి కటకటలాడుతున్నారు.
గిరిజన ప్రాంత ముఖ్య కేంద్రమైన గుమ్మలక్ష్మీ పురంలో ఉన్న భద్రగిరి 50 పడకల ఆసుపత్రికి కనీస సౌకర్యాలు లేక వైద్యు లు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మండలంలోని భోగాపురం నుంచి ముక్కాం వెళ్లే ఆర్అండ్బీ రహదారి సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన బస్సుషెల్టర్లు ప్రమాదకరంగా ఉన్నాయి.
పేదలను వైసీపీ సర్కారు మోసం చేసింది. సంక్షేమ పథకాలకు సీఎం జగన్ బటన్ నొక్కి నెలలు గడుస్తున్నా ఇంకా పేదల ఖాతాల్లోకి నగదు జమ కాలేదు.
జిల్లాలో పార్వతీపురం, సీతంపేటలోని ఐటీడీఏల పరిస్థితి దయనీయంగా మారింది. నిధుల లేమితో సతమతమవుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏల అభివృద్ధికి పుష్కలంగా నిధులు కేటాయించేవారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది.
మండలంలోని వెంకటమరణపేట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బొబ్బిలి అప్పలస్వామి (25) ఆదివారం సాయంత్రం పిడుగుపడి మృతి చెందాడు.
తామంతా బాగానే ఉన్నామని, ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రస్తుతం హాస్టళ్లలోనే ఉంటున్నామని కిర్గిస్థాన్ దేశంలో చదువుతున్న జిల్లా విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు ఆదివారం సాయంత్రం ఫోన్ చేసి చెప్పారు.
ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం కన్నుల పండువుగా వార్షిక కల్యాణ మహోత్సవం నిర్వహించారు.