చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2023-11-29T00:14:00+05:30 IST
రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు, పాఠశాల సి బ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
![చికిత్స పొందుతూ విద్యార్థి మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సీతంపేట: రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు, పాఠశాల సి బ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీతంపేట మండ లం అక్కన్నగూడకు చెందిన నవదీప్(16) మల్లి గిరిజన బా లుర ఆశ్రమ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 17న పాఠశాల ఉపాధ్యాయులకు ఎవరికీ చెప్పకుండా బ యటకు వచ్చి ద్విచక్ర వాహనంపై దేవనాపురం వైపు వెళ్లి అదుపు తప్పి కింద పడ్డాడు. తలకు, శరీరానికి బలమైన గాయాలు కావడంతో పాఠశాల సిబ్బంది వెంటనే శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పది రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జిల్లా గిరిజన సంక్షేమశాఖ డీడీ మంగవేణి, పాఠశాల హెచ్ఎం పాలక నారాయుడు, అక్కన్న గూడ గ్రామానికి చేరుకొని మృతుని తండ్రి సవర శీను కుటుంబాన్ని ఓదార్చారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై జగదీష్ నాయుడు కేసు నమోదు చేశారు.