ట్రాన్స్ ఫార్మర్ చోరీ
ABN , First Publish Date - 2023-11-29T00:14:59+05:30 IST
మండలంలోని కొటారుబిల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబరు 65-4లో ఇళ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురైన ట్లు స్థల యజమాని బొడ్డు శ్రీనివాసరావు మంగళవారం విద్యుత్ ఏఈ ప్రసన్న కు మార్కు ఫిర్యాదు చేశారు.
![ట్రాన్స్ ఫార్మర్ చోరీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
గంట్యాడ: మండలంలోని కొటారుబిల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబరు 65-4లో ఇళ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురైన ట్లు స్థల యజమాని బొడ్డు శ్రీనివాసరావు మంగళవారం విద్యుత్ ఏఈ ప్రసన్న కు మార్కు ఫిర్యాదు చేశారు. గత ఏడాది ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకున్నామని, అ యితే ఉదయం స్థలంలో వచ్చి చూసే సరికి స్తంభంపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ను కిందకు దించి అందులో ఉన్న విలువైన కోయిల్ను చోరీ చేసినట్లు ఫిర్యాదు చేశా రు. ఇదే విషయం విద్యుత్ శాఖ ఏఈ ప్రసన్న కుమార్ వద్ద ప్రస్తావించగా దీనిపై సమాచారం వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.