ఏం ఉద్ధరించారని బస్సు యాత్ర?
ABN , First Publish Date - 2023-11-29T00:07:03+05:30 IST
నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు ఏం ఉద్ధరించారని బస్సు యాత్ర నిర్వహిస్తున్నారని టీడీపీ, జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించారు.
![ఏం ఉద్ధరించారని బస్సు యాత్ర?](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కురుపాం: నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు ఏం ఉద్ధరించారని బస్సు యాత్ర నిర్వహిస్తున్నారని టీడీపీ, జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించారు. మంగళవారం కురుపాం టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన నాయకు లు విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యలను గాలికి వదిలేసి... బస్సు యాత్ర చేయడం ఏమిటని ప్రశ్నించారు. ‘ఏనుగుల దాడిలో చనిపోయిన వారికి పలకరించనందుకా? కరవుతో అల్లాడుతున్న రైతులు ఇబ్బందులు పడు తుంటే పట్టించుకోలేనందుకా? నిరుద్యోగ సమస్యలు గాలికి వదిలేసినందుకా? ఉద్యోగులకు గుడ్డు సున్నా చూపినందుకా?’ అని ఎద్దేవా చేశారు. రిటైర్డ్ ఉద్యో గులకు రావలసిన బెనిఫిట్స్ ఇవ్వనందుకా? గిరిజనులకు ఉపయోగపడే జీఓ నెంబరు 3 తొలగించినందుకా? వట్టిగెడ్డ, గుమ్మడి గెడ్డ అనుసంధానం చేయ నందుకా ఈ బస్సు యాత్ర? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ టీడీపీ ఎస్టీ, ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, జనసేన సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు, మండల కన్వీనర్ కేవీ కొండయ్య, టీడీపీ నాయకులు కిమిడి రామరాజు, కర్రి శ్రీనివాసరావు, కోట బుజ్జి, కలిశెట్టి శ్రీనివాసరావు, జనసేన నాయకులు ఎన్.వంశీ, జి.గౌరీశంకరరావు, పి.శంకరరావు, వి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.