Share News

వృద్ధురాలి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2023-11-29T00:18:11+05:30 IST

ఉనికిలిలో వృద్ధురాలి అను మానాస్పద మృతిపై మండవల్లి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

 వృద్ధురాలి అనుమానాస్పద మృతి

శరీరంపై గాయాలు.. మెడలో గొలుసు మాయం

మండవల్లి, నవంబరు 28: ఉనికిలిలో వృద్ధురాలి అను మానాస్పద మృతిపై మండవల్లి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన దాసరి బేబీ సరోజని (80) మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు రాలేదు. ఆమె కోడలు శ్రీదేవి లోనికి వెళ్లి చూడగా అత్తగారు మృతి చెంది ఉన్నారు. తల్లి మెడలోని ఆరు కాసుల బంగారు గొలుసు కనిపించకపోవడం, శరీరంపై గాయాలుండడాన్ని గమనించిన కుమారుడు కిషోర్‌ మండవల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కైకలూరు రూరల్‌ సీఐ కే కృష్ణకుమార్‌, మండవల్లి ఎస్సై టి రామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-11-29T00:18:13+05:30 IST