Cash van looted: ఏటీఎం వ్యాన్ గార్డును కాల్చేసి.. నగదుతో పరారీ!

ABN , First Publish Date - 2023-01-10T20:53:48+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఏటీఎం వ్యాన్ (ATM) గార్డును కాల్చేసిన గుర్తు తెలియని వ్యక్తులు నగదుతో పరారయ్యారు. నగర శివారులోని జగత్‌పూర్ ఫ్లై ఓవర్

Cash van looted: ఏటీఎం వ్యాన్ గార్డును కాల్చేసి.. నగదుతో పరారీ!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఏటీఎం వ్యాన్ (ATM) గార్డును కాల్చేసిన గుర్తు తెలియని వ్యక్తులు నగదుతో పరారయ్యారు. నగర శివారులోని జగత్‌పూర్ ఫ్లై ఓవర్ (Jagatpur Flyover) సమీపంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం జగత్‌పూర్ ఫ్లై ఓవర్ సమీపంలోని ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ఏటీఎంలో నగదు నింపేందుకు సాయంత్రం 4.50 గంటల సమయంలో వ్యాన్ అక్కడికి చేరుకుంది.

వ్యాన్ ఆగగానే వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి వ్యాన్‌కు రక్షణగా ఉన్న గార్డును కాల్చేసి డబ్బుపెట్టెతో పరారయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గార్డును ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-01-10T20:53:49+05:30 IST