Myanmar: తిరుగుబాటుదారులపై మిలటరీ దాడులు...100 మంది మృతి

ABN , First Publish Date - 2023-04-12T08:10:23+05:30 IST

సెంట్రల్ మయన్మార్ లో మంగళవారం తిరుగుబాటుదారులపై మిలటరీ జవాన్లు దాడులు...

Myanmar: తిరుగుబాటుదారులపై మిలటరీ దాడులు...100 మంది మృతి
Myanmar Military Attacks

బ్యాంకాక్ : ఐక్యరాజ్యసమితి పాశ్చాత్య శక్తుల దాడులను ఖండించిన నేపథ్యంలో సెంట్రల్ మయన్మార్ లో మంగళవారం తిరుగుబాటుదారులపై మిలటరీ జవాన్లు దాడులు చేశారు.(Myanmar) ఈ దాడుల్లో 100 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.(Military Attacks Rebel Gathering) 2021వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మిలటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆగ్నేయాసియా దేశం మయన్మార్ లో గందరగోళం నెలకొంది. ప్రాణాంతక వైమానిక దాడులు చేశారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం చీఫ్ వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు.సగయింగ్ ప్రాంతంలోని టౌన్‌షిప్‌పై మంగళవారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో పలువురు మరణించారు.

మయన్మార్ సాయుధ దళాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ఒక ప్రకటనలో తెలిపారు.వైమానిక దాడుల పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని వాషింగ్టన్ తెలిపింది.భయంకరమైన హింసను నిలిపివేయాలని బర్మా ప్రజల సమగ్ర ప్రజాస్వామ్య ఆకాంక్షలను గౌరవించాలని యునైటెడ్ స్టేట్స్ బర్మా పాలకులకు పిలుపునిచ్చింది.

మృతదేహాలను వెలికితీసి, వైద్య చికిత్స కోసం బాధితులను తరలించిన తర్వాత, మృతుల సంఖ్య 100 దాటవచ్చని అధికారులు అంచనా వేశారు.మయన్మార్ సైన్యం యొక్క వైమానిక దాడిలో పౌరులను చంపడాన్నిజర్మనీ యొక్క విదేశాంగ కార్యాలయం తీవ్రంగా ఖండించింది.

Updated Date - 2023-04-12T08:14:22+05:30 IST