Share News

Madyapradesh:వివాదంలో బీజేపీ మంత్రి.. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని విమర్శలు

ABN , First Publish Date - 2023-10-26T10:30:10+05:30 IST

మధ్యప్రదేశ్(Madyapradesh)కి చెందిన మంత్రి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి.. వివాదంలో చిక్కుకున్నారు. ఓ ప్రాంతాన్ని ఉద్దేశిస్తూ ప్రముఖ నటి డ్యాన్స్‌తో ముడిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన కామెంట్లపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

Madyapradesh:వివాదంలో బీజేపీ మంత్రి.. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని విమర్శలు

భోపాల్: మధ్యప్రదేశ్(Madyapradesh)కి చెందిన మంత్రి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి.. వివాదంలో చిక్కుకున్నారు. ఓ ప్రాంతాన్ని ఉద్దేశిస్తూ ప్రముఖ నటి డ్యాన్స్‌తో ముడిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన కామెంట్లపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా(Narotham Mishra) ఎన్నికల ప్రచారం సందర్భంగా దాతియాలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో జనాల ముందు నటి హేమమాలిని(Hema Malini)ని ఉద్దేశిస్తూ ఇలా మాట్లాడారు.. "దాతియాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, హేమమాలిని కూడా డ్యాన్స్ చేసేంత స్థాయిలో దాతియాను అభివృద్ధి చేశారు" అని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపుతున్నాయి.


సోషల్ మీడియాలో ఆయన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రతిపక్ష జనతాదళ్(యు) ఎక్స్(X) హ్యాండిల్ లో ఆయనను ఉద్దేశించి పోస్ట్ చేసింది. "మహిళలను ఉద్దేశించి బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వారికి మహిళలపట్ల ఉన్న గౌరవం చూడండి. హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అవమానకర రీతిలో మాట్లాడారు. తన సొంత పార్టీ ఎంపీని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు" అని పోస్ట్ లో రాసింది. మధ్యప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నరోత్తమ్ మిశ్రా 4వ సారి దాతియా(Datia) నుంచి పోటీ చేస్తున్నారు. మిశ్రా 2008, 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి గెలిచారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత రాజేంద్ర భారతిని కాంగ్రెస్(Congress) బరిలోకి దింపింది.

Updated Date - 2023-10-26T10:30:51+05:30 IST