Share News

70 లక్షల మొబైల్‌ నెంబర్ల సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2023-11-29T05:11:42+05:30 IST

డిజిటల్‌ నేరాలను అదుపు చేయడం కోసం దేశంలో 70 లక్షల మొబైల్‌ నెంబర్లను ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్‌ జోషి చెప్పారు.

70 లక్షల మొబైల్‌ నెంబర్ల సస్పెన్షన్‌

న్యూఢిల్లీ, నవంబరు 28: డిజిటల్‌ నేరాలను అదుపు చేయడం కోసం దేశంలో 70 లక్షల మొబైల్‌ నెంబర్లను ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్‌ జోషి చెప్పారు. అనుమానాస్పద లావాదేవీల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. డిజిటల్‌ చెల్లింపుల్లో మోసాలు, సైబర్‌ భద్రతపై మంగళవారం ఇక్కడ జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సైబర్‌ భద్రతను పటిష్ఠపరచుకోవాలని బ్యాంకులకు సూచించినట్టు తెలిపారు. ఆధార్‌ ఆధారిత చెల్లింపుల్లోనూ మోసాలు జరుగుతున్నాయన్నారు.

Updated Date - 2023-11-29T06:50:36+05:30 IST