WPL 2023: టాస్ గెలిచిన ఆర్సీబీ.. ఈ మ్యాచ్‌లోనైనా బోణీ కొట్టేనా?

ABN , First Publish Date - 2023-03-10T19:19:40+05:30 IST

మహిళల ప్రీమియర్ లీగ్‌(WPL)లో మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. యూపీ వారియర్స్‌(UP Warriorz)తో

 WPL 2023: టాస్ గెలిచిన ఆర్సీబీ.. ఈ మ్యాచ్‌లోనైనా బోణీ కొట్టేనా?

ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌(WPL)లో మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. యూపీ వారియర్స్‌(UP Warriorz)తో జరగనున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన స్మృతి మంధాన(Smriti Mandhana) జట్టు బోణీ కొట్టలేకపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమవుతున్న ఆ జట్టుకు విజయం ఇప్పటి వరకు అందని ద్రాక్షగా మారింది. ఈ నేపథ్యంలో విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు, ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన యూపీ వారియర్స్ ఒక దాంట్లో విజయం సాధించి, మరో దాంట్లో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని చూస్తోంది.

Updated Date - 2023-03-10T19:19:40+05:30 IST