Home » Sports » Cricket News
సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ ఐపీఎల్-2024లో దుమ్ముదులిపేస్తున్నాడు. ఈ సీజన్ ప్రారంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ యువ క్రికెటర్..
ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ ఆడనున్న నాలుగు జట్లు ఖరారయ్యాయి. శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించడంతో నాలుగవ ప్లే ఆఫ్ బెర్త్ ఖాయమైంది. కానీ 2, 3 స్థానాల్లో నిలిచే జట్లపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఐపీఎల్ 2024 లీగ్ దశలో తన చివరి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉత్కంఠ భరిత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 66 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. హెచ్రిచ్ క్లాసెన్ (42), నితీశ్ రెడ్డి (37), రాహుల్ త్రిపాఠి (33) రాణించడంతో భారీ టార్గెట్ను సన్రైజర్స్ ఛేదించింది.
ఐపీఎల్ 2024 తొలి అర్ధభాగంలో పాయింట్ల పట్టికలో చిట్టచివర స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్కు చేరుతుందని ఎవరూ భావించలేదు. కానీ ఆత్మవిశ్వాసంతో ఆడిన ఆర్సీబీ ఆటగాళ్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఏకంగా వరుసగా ఆరు విజయాలు సాధించి అనూహ్యంగా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టారు.
ఐపీఎల్ 2024లో చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ చెలరేగారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 71 పరుగులతో చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఇరు జట్లకు చివరి లీగ్ మ్యాచ్ షురూ అయ్యింది. ఈ మ్యాచ్లో టాస్ పడింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
విరాట్ కోహ్లీ.. ఈ టీమిండియా స్టార్ ఆటగాడు ఇప్పటివరకూ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో హేమాహేమీలు సాధించిన ఎన్నో ఘనతల్ని బద్దలుకొట్టి, సరికొత్త బెంచ్మార్క్లను..
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టేసింది. బెంగళూరు వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అద్భుత విజయాన్ని నమోదు చేసి..
ఇటీవల రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అందులో కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో మాట్లాడుతూ కనిపించిన రోహిత్..
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ పెద్ద షాకిచ్చింది. అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అంతేకాదు.. రూ.30 లక్షల భారీ జరిమానా కూడా..