Share News

Kumaram Bheem Asifabad: ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

ABN , First Publish Date - 2023-11-26T22:52:41+05:30 IST

ఆసిఫాబాద్‌, నవంబరు 26: భారత రాజ్యాంగదినోత్సవాన్ని ఆదివారం ఆసిఫా బాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

Kumaram Bheem Asifabad:   ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

ఆసిఫాబాద్‌, నవంబరు 26: భారత రాజ్యాంగదినోత్సవాన్ని ఆదివారం ఆసిఫా బాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు వినోద్‌, అశోక్‌, సుధాకర్‌, ప్రమోద్‌, అతీష్‌, అనీల్‌, కృష్ణజీ, అజిత్‌, సురేష్‌, శంకర్‌, నితిన్‌, సాయి, గౌతం, వెంకటేష్‌, నవీణ్‌, ఆకాష్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి: మండలకేంద్రంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూల మాలలువేసి నివా ళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో బౌద్ధమహాసభ సభ్యులు జయరాం, ఏవో మిలింధ్‌కుమార్‌, శ్యాంరావు, సందీప్‌, అరుణ్‌, బుద్ధిస్ట్‌ సొసైటీ నాయకులు టిమాజీ, మారుతి, తదితరులు పాల్గొన్నారు.

లింగాపూర్‌: మండలకేంద్రంలోని కరుణ బౌద్ధవిహార్‌లో ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అంబేద్కర్‌ కమిటీ బౌద్ధఉపాసకులు, గ్రామస్థులుఘనంగా నిర్వహించారు. కార్యక్ర మంలో అంబేద్కర్‌ మెమోరియల్‌ అసోషియేషన్‌ నాయ కులు, కరుణమహిళా మండలిసభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

జైనూర్‌: మండలకేంద్రంలో అంబేద్కర్‌ మెమోరియల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కాంబ్లే అన్నారావ్‌, ఉపాధ్యక్షుడు కాంబ్లే అశోక్‌, ప్రధానకార్యదర్శి భుతాలె వెంకట్‌ రావ్‌ అంబే ద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

Updated Date - 2023-11-26T22:52:43+05:30 IST