Apsara Case : నిన్న రాత్రి శంషాబాద్ పీఎస్‌లో సాయికృష్ణ వింత ప్రవర్తన.. బోరున విలపిస్తూ..

ABN , First Publish Date - 2023-06-10T12:54:05+05:30 IST

అప్సర అనే మహిళను హత్య చేసిన సాయి కృష్ణ.. నిన్న రాత్రి శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో హంగామా చేసినట్టు తెలుస్తోంది. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ సాయికృష్ణ బోరున విలపించినట్టు సమాచారం. సాయికృష్ణ ప్రవర్తనను చూసి పోలీసులు భయపడిపోయినట్టు తెలుస్తోంది.

Apsara Case : నిన్న రాత్రి శంషాబాద్ పీఎస్‌లో  సాయికృష్ణ వింత ప్రవర్తన.. బోరున విలపిస్తూ..

హైదరాబాద్ : అప్సర అనే మహిళను హత్య చేసిన సాయి కృష్ణ.. నిన్న రాత్రి శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో హంగామా చేసినట్టు తెలుస్తోంది. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ సాయికృష్ణ బోరున విలపించినట్టు సమాచారం. సాయికృష్ణ ప్రవర్తనను చూసి పోలీసులు భయపడిపోయినట్టు తెలుస్తోంది. తనను జైలుకి పంపినా సరే.. బతకనని సాయికృష్ణ చెప్పినట్టుగా తెలుస్తోంది. తనకు అసలు అప్సర ని చంపే ఉద్దేశం ఎట్టిపరిస్థితుల్లో లేదని.. పెళ్లి చేసుకోమని కొన్ని రోజులుగా టార్చర్ చేసిందని చెప్పాడట. పెళ్లి చేసుకోకపోతే.. తాము దిగిన ఫోటోలు, పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని అప్సర బెదిరించినట్లు సాయి కృష్ణ చెప్పాడు.

కాగా.. నిన్న పోలీసుల విచారణలో భాగంగా సాయికృష్ణ.. ‘అప్సర గర్భం దాల్చింది. అందుకు నేనే కారణమని పెళ్ళిచేసుకోవాలని ఒత్తిడి చేసింది. కానీ ఆమె వేరేవాళ్లతో కూడా సన్నిహితంగా ఉండేది. ఇవన్నీ భరించలేకే హత్య చేశాను’ అని వెల్లడించాడు. కాగా.. సాయి కృష్ణను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ రోజు ఉదయం నిందితుడిని జడ్జి ఇంటి ముందు శంషాబాద్ ఆర్జీఐ పోలీసులు హాజరుపరిచారు. సాయికృష్ణకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

Updated Date - 2023-06-10T13:19:07+05:30 IST