Home » Telangana » Hyderabad
Telangana: రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వర్సిటీలకు రేపటితో (మంగళవారం) పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం వీసీల పంచాయితీ సెక్రటేరియట్కు చేరింది. పాత వైస్ చాన్సలర్లపై ఫిర్యాదులు, కొత్త వీసీ పోస్టుల కోసం బ్యాక్ డోర్ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా వీసీ పోస్టుల కోసం 1300కు పైగా దరఖాస్తులు వచ్చి చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఒక్కో వీసీపై రెండంకెల ఫిర్యాదులు నమోదు అయ్యాయి.
Telangana: రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్రావు వ్యాఖ్యలు చేశారు. డయాగ్నస్టిక్ కేంద్రాల్లో వైద్యులు, సిబ్బందికి పెండింగ్ జీతాల చెల్లింపుపై హరీష్రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..
Telangana: గ్రేటర్లో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు సమ్మెకు దిగారు. సోమవారం ఉదయం నగరంలోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల వద్ద కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టుల మెరుపు సమ్మెతో నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు.
అతనో స్వీపర్.. ఆఫీసును శుభ్రపరచడమే పని..! కానీ పనిచేయకున్నా.. అడిగినప్పుడు సంతకాలు మాత్రం పెట్టి, నెలకు తీసుకునే జీతం రూ.2 లక్షలు..! కారణం.. జీఎస్టీ రీఫండ్ కోసం అతణ్ని డైరెక్టర్గా చూపించడమే..! అతనొక్కడే కాదు.. ఆఫీ్సబాయ్, హౌస్కీపింగ్లో పనిచేసే ఒకరిద్దరిని డైరెక్టర్లుగా పెట్టడం గమనార్హం..!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీ రేపటితో(సోమవారం) ముగియనున్నది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ రేపు విచారణ జరగనున్నది. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 2గంటలకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే విషయంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారించనున్నది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టు ముందు ఈడీ, సీబీఐ హాజరు పరిచే అవకాశం ఉంది.
సుచిత్రలో నెలకొన్న భూవివాదంపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy) హాట్ కామెంట్స్ చేశారు. భూమి విషయంలో తన వద్ద ఉన్నవి తప్పుడు డాక్యూమెంట్స్ అని కాంగ్రెస్ నేతలు(Congress Leaders) ఆరోపించడంపై తీవ్రంగా స్పందించారు. తన డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధం అని ప్రకటించారు మల్లారెడ్డి. తనపై ఆరోపణలు చేసిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్(MLA Laxman) సిద్ధమా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్: మద్యం కొనేందుకు వెళ్లిన తన భర్తపై వైన్ షాపు సిబ్బంది దాడి చేసి తల పగల గొట్టారు. రక్తంతో ఇంటికి వచ్చిన భర్తను చూసిన భార్య ఆగ్రహంతో రెచ్చిపోయింది. వెంటనే కొంతమందిని తీసుకుని వైన్ షాప్కు వెళ్లి సిబ్బందిపై దాడి చేసింది. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను జుట్టు పట్టుకుని కొట్టింది.
వర్షాకాలం ప్రారంభానికి ముందే విద్యుత్ లైన్ల మరమ్మతులను పూర్తిచేసే దిశగా విద్యుత్శాఖ(Electricity Department) చర్యలు చేపట్టింది. ఒక్కో ఫీడర్ పరిధిలో అరగంట విద్యుత్(Power Supply Off) బంద్ చేసి పనులు చేపట్టనుంది. ఈమేరకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మరమ్మతులు చేసుకునేందుకు వీలుగా ఎల్సీ(లైన్ క్లియరెన్స్) ఇచ్చేందుకు విద్యుత్శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
డబ్బు సంపాదన కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. కనిపించిన ప్రతి వస్తువును నకిలీగా మారుస్తున్నారు. ఇటీవల కాలంలో బ్రాండెడ్ వస్తువులను నకిలీవి తయారు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో కొంతమంది నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టును తయారు చేసి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టు కొనుగోలు చేసిన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
ఈ నెల 18 వ తేదీన తెలంగాణ కేబినేట్ భేటీ కానున్నది. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ సమస్యలు, ఉమ్మడి ఏపీతో పీట ముడిగా ఉన్న సమస్యలపై పరిష్కారం దిశగా ఈ భేటీలో చర్చించనున్నారు.వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల కొనుగోళ్లపై మంత్రి వర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.