మద్యం ప్రియులకు నిజంగా చేదువార్త.. ఎందుకంటే.. అసలే వీకెండ్.. ఆదివారం సరదగా కాసేపు ఓ పెగ్గు వేసుకుని పడుకోవచ్చని అంతా అనుకుంటూ ఉంటారు. ఇంతలో మందు షాపులు బంద్ అంటే మద్యం ప్రియులకు ఎలా ఉంటుంది.
హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్ కార్మికుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్(TGCO)పై సీఎం శుక్రవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటివారంలోగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సూచించారు.
తెలంగాణలో మళ్లీ లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(LRS)ను అమల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మీడియాకు కీలక ప్రకటన జారీ చేసింది. ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విధివిధానాలు ఖరారు కోసం మంత్రులు మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఇతర ఉన్నతాధికారులతోసమీక్షా సమావేశం నిర్వహించారు
ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అధిక వడ్డీతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రుణాలు తీసుకున్నారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) విమర్శించారు.
Telangana: నామినేటెడ్ పదవుల్లో మహిళ రిజర్వేషన్పై ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించినట్లు మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆల్ ఇండియా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలంభ ఆదేశాలతో ఈ నెల 29న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Telangana: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ట్రాస్.. గ్యాస్ అని ఈస్ట్మన్ కలర్ మాదిరిగా చెప్పారని.. ఓ కథ చెప్పినట్లు ఉందంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ... 2023లో రెండు లక్షల తొంభై వేల కోట్లు ఖర్చు చేసినట్టు కేసీఆర్ ప్రజలకు చూపించారని.. ఆదాయాన్ని ఎక్కువగా చూపించి ప్రజలను మోసం...
Telangana: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై హస్తం నేతలు మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో హైదరాబాద్కు ఎన్ని నిధులు ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నాడు గాంధీభవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ అసెంబ్లీ నిన్న కాంగ్రెస్ సర్కార్ ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టిందని అన్నారు.
Telangana: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు రుణామాఫీ విషయంలో ఇచ్చిన మాట తప్పి.. ఆలస్యం చేయడం వల్ల రైతులకు కొత్త సమస్యలు మొదలయ్యాయని మండిపడ్డారు. ఏడు నెలల వడ్డీపై రైతులను బ్యాంకులు వేధిస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించిన రైతులకు అండగా నిలబడాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.