పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి
ABN , First Publish Date - 2023-11-29T00:20:42+05:30 IST
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామనికలెక్టర్ అనురాగ్ జయంతి కేంద్ర ఎన్నికల అధికారుకు వివరించారు.
![పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి](https://media.andhrajyothy.com/media/2023/20231102/2_c0e1790dc6.jpg)
సిరిసిల్ల కలెక్టరేట్, నవంబరు 28: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామనికలెక్టర్ అనురాగ్ జయంతి కేంద్ర ఎన్నికల అధికారుకు వివరించారు. ఏర్పాట్లుపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మంగళ వారం రాత్రి కలెక్టర్, ఎస్పీ అఖిల్ మహాజన్తో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ర్టిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, ఈవీఎం యంత్రాల తరలింపు, కౌంటింగ్ ఏర్పాట్లు తదితర అం శాలపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అడిగి తెలు సుకున్నారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, సిరిసిల్ల, వేములవాడ రిటర్నింగ్ అధికారులు అనంద్కుమార్, మధుసూధన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.