కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి

ABN , First Publish Date - 2023-01-04T00:02:09+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్‌ గౌడ్‌ అన్నారు.

కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్‌

మేడిపల్లి, జనవరి 3: కాంగ్రెస్‌ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్‌ గౌడ్‌ అన్నారు. మే డిపల్లి, భీమారం మండలాల్లో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల వితృతస్థాయి సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించిన సంస్థలను అమ్ముకుంటూ పోతూఉంటే, రాష్ట్రంలో ఉన్న బీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంచి ఇతర రాష్ట్రాలకు దోచిపెడుతోందన్నారు. యువతలో బావోద్వేగాలను ఉసగోల్పి దేశాన్ని వెనుబాటుకు కారణమౌతుంది బీజేపీ అని అన్నారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే సంక్షేమ కార్యక్రమాలను గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆదిశ్రీనివాస్‌ మాట్లాడుతూ నియోజక వర్గం లోని సమస్యలను కార్యరక్తలతో చర్చించి వాటి పరిప్కారానికి చేయాల్సిన పనులు వివరరించారు. మండల కమిటీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ నిర్వహించారు. తుది నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామన్నరు. అనంతరం సావిత్రిబాయి పూలే జయంతి వేలుకలు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి ఆర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్‌రెడ్డి, విజ య్‌, శంకర్‌, నర్సయ్య, బక్కరి నరేష్‌, కొమురయ్య, రమేష్‌రెడ్డి, నిజామొద్దిన్‌, వినయ్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-04T00:02:11+05:30 IST