చివరి శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తా..
ABN , First Publish Date - 2023-11-29T00:24:52+05:30 IST
చివరిశ్వాస వరకు రామగుండం ప్రజల కోసం పని చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్సింగ్ చెప్పారు.
కోల్సిటీ, నవంబరు 28: చివరిశ్వాస వరకు రామగుండం ప్రజల కోసం పని చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్సింగ్ చెప్పారు. మంగళవారం 6వ డివిజన్ ఐబీకాలనీలో జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ రామగుండం ప్రజలకు ఏసమస్యల వచ్చినా ముందుంటున్నాని, 25ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని, రామగుండాన్ని బొందల గడ్డగా మార్చారని, ఇక్కడి యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారని, ఇక్కడ వ్యా పారాలు కుదేలయ్యాయని, చాలామంది కాలుష్యంతో ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారని, పరిశ్రమలు వచ్చినా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం లేదని, ఆర్ఎఫ్సీఎల్లో స్థానిక ఎమ్మెల్యే ఉద్యోగాలను అ మ్ముకున్నాడని, ఎన్టీపీసీలో కూడా నిరుద్యోగులకు అవకాశం లభించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు, గృహిణికి రూ.2500, ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి, గడ్డం శ్రీనివాస్, పెంచాల తిరుపతి, వీరబోయిన రవికుమార్ పాల్గొన్నారు.