Mainampalli: మైనంపల్లి సంచలన కామెంట్స్... రాత్రి సమయంలో ఫోన్లుచేసి బెదిరిస్తున్నారు..

ABN , First Publish Date - 2023-10-10T07:56:32+05:30 IST

కాంగ్రెస్‌ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Malkajigiri MLA Mainampalli Hanumantha Rao) ఆరోపించారు.

Mainampalli: మైనంపల్లి సంచలన కామెంట్స్... రాత్రి సమయంలో ఫోన్లుచేసి బెదిరిస్తున్నారు..

- ప్రభుత్వం ఒంటెద్దు పోకడ పోతుంది

- గట్టిగా బుద్ది చెబుతాం: మైనంపల్లి

అల్వాల్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Malkajigiri MLA Mainampalli Hanumantha Rao) ఆరోపించారు. అల్వాల్‌ పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ శ్రేణులపై, తన ముఖ్య అనుచరులపై పోలీసులు రాత్రి సమయంలో ఫోన్లు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రభుత్వానికో, మరోకరికో కొమ్ము కాయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడ పోతుంది గట్టిగా బుద్ది చెబుతామన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 5 సంవత్సరాలుగా ఒకే గన్‌మెన్‌లు ఉన్నప్పటికి తన గన్‌మెన్‌లను మాత్రం మార్చరని ఇది సరైన పద్ధతి కాదని ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే అస్త్రంతో గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు.

కాంగ్రెస్‏లో పలువురి చేరిక

మచ్చబొల్లారం డివిజన్‌ టీడీపీ సీనియర్‌ నాయకుడు నవనీతం చిట్టిబాబు తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో బీఆర్‌ఎస్‌, టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులు స్వచ్ఛందంగా మందుకు వచ్చి పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు జరుగుతాయన్నారు.

Updated Date - 2023-10-10T09:30:01+05:30 IST