Muthireddy: బీఆర్ఎస్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి చెందింది

ABN , First Publish Date - 2023-10-02T15:36:02+05:30 IST

ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలు దమ్ము.. దైర్యం ఉంటే దేశంలో రాష్ట్రానికి రావలసిన రూ. 94 వేల కోట్లను తీసుకురావాలి. కిషన్ రెడ్డికి సోయి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల్లో దేనికి జాతియ హోదా

Muthireddy: బీఆర్ఎస్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి చెందింది

సిద్దిపేట: తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డిలు నిరూపిస్తే గోషి గొంగడి ధరించి జీవితాంతం రాష్ట్రంలో తిరుగుతానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy) అన్నారు. కొమురవెల్లి మండలం కిష్టంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను, స్వాత్రంత్య సమరయోధుల విగ్రహాలను ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రారంభించారు. అనంతరం ముత్తిరెడ్డి మాట్లాడారు. ‘‘ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలు దమ్ము.. దైర్యం ఉంటే దేశంలో రాష్ట్రానికి రావలసిన రూ. 94 వేల కోట్లను తీసుకురావాలి. కిషన్ రెడ్డికి సోయి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల్లో దేనికి జాతియ హోదా తెస్తావో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో రైతు బంధు, పెన్షన్, కళ్యాణ లక్ష్మీ, రైతు భీమా, రైతు రుణ మాపీ లాంటి పథకాలతో ఒక్కో గ్రామానికి కోట్ల రూపాయల నిధులను కేటాయించి 9 ఏళ్లుగా అభివృద్ధి చేయిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది.’’ అని తెలిపారు.

Updated Date - 2023-10-02T15:36:02+05:30 IST