Share News

Errabelli : ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

ABN , First Publish Date - 2023-10-27T11:12:40+05:30 IST

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే సభకు తగిన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Errabelli : ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

మహబూబాబాద్ : మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే సభకు తగిన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంట్లు వేయకుండా సభలో జనం ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. ఏం ఏర్పాట్లు చేశారంటూ ఎమ్మెల్యేపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. మధ్యాహ్నం మూడు గంటలకు మహబూబాబాద్‌లో కేసీఆర్ సభ జరగనుంది. ఈ సభ ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు.

Updated Date - 2023-10-27T11:12:40+05:30 IST