Share News

MLA: ఎమ్మెల్యే మాగంటి సంచలన కామెంట్స్.. వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా విజయం బీఆర్ఎస్‏దే.‏..

ABN , First Publish Date - 2023-10-28T08:31:03+05:30 IST

ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం బీఆర్‌ఎస్‏నే వరిస్తుందని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(Jubilee Hills MLA Maganti Gopinath) అన్నారు.

MLA: ఎమ్మెల్యే మాగంటి సంచలన కామెంట్స్.. వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా విజయం బీఆర్ఎస్‏దే.‏..

బంజారాహిల్స్‌(హైదరాబాద్(, (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం బీఆర్‌ఎస్‏నే వరిస్తుందని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(Jubilee Hills MLA Maganti Gopinath) అన్నారు. జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో ప్రచారానికి సిద్ధ్దమైన రథాలను ఆయన కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించినవే కాకుండా కొత్త వాటిని కూడా ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రజలను ఆకట్టుకునేందుకు ఆచరణ సాధ్యం కాని పథకాలను ప్రతిపక్షాలు ప్రకటిస్తున్నాయన్నారు. కర్నాటక(Karnataka)లో పథకాలు అమలు చేయలేక చతికిల పడ్డ కాంగ్రెస్‌ తెలంగాణలో ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. రైతుబంధు పథకం విషయంలో కూడా కాంగ్రెస్‌ రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. ఇలాంటి పార్టీలకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్‌కుమార్‌ పటేల్‌, సీఎన్‌ రెడ్డి, నాయకులు సంతోష్‌, ప్రదీప్‌, సంజీవ పాల్గొన్నారు.

Updated Date - 2023-10-28T08:31:03+05:30 IST