Share News

స్వామికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు

ABN , First Publish Date - 2023-11-02T00:06:53+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం నిత్యపూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.

స్వామికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు
నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, నవంబరు 1: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం నిత్యపూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వా మిని మేల్కొలిపిన ఆచార్యులు గర్భాలయంలోని స్వయంభువులకు, సువ ర్ణ ప్రతిష్టా అలంకార కవచమూర్తుల ను పంచామృతాలతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చించారు. అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహన సేవలో ఊరేగించిన ఆచార్యులు దేవతల సేనానాయకుడు విశ్వక్సేనుడికి తొలి పూజలతో నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. సుదర్శన నారసింహ హవన పూజలు కొనసాగాయి. కొండపైన అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి, స్ఫటిక మూర్తులకు నిత్య పూజలు, యాగశాలలో రుద్రహవనం స్మార్త సంప్రదాయరీతిలో నిర్వహించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ నిత్య పూజలు కొనసాగాయి. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.11,02,409ల ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అఽధికారులు తెలిపారు.

Updated Date - 2023-11-02T00:06:53+05:30 IST