Home » Telangana » Nalgonda
ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్షరెడ్డి అన్నారు.
మండలంలో నిలిచిన ధా న్యం కొనుగోళ్లను త్వరగా పూర్తిచేయాలని గ్రామీణ అభివృద్ధిశాఖ కమిషనర్ అనితారామచంద్రన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పోచంప ల్లి, రేవణపల్లిలోని పీఎసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ హనుమంతు కే.జెండగేతో కలిసి తనిఖీ చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మో సపూరిత హామీలనే రేవంత్రెడ్డి ఇచ్చార ని, అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో ఛీ కొట్టించుకుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం, మిర్యాలగూడలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని పదేళ్ల పాలనలో భ్రష్టు పట్టించగా, సీం రేవంత్రెడ్డి ఐదు నెలల్లో రాష్ట్రాన్ని వెనుకబాట పట్టించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆదివారం భువనగిరి, ఆలేరులో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ గె లుస్తుందని, రాహుల్గాంధీ ప్రధాని కావడం ఖాయమని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. హుజూర్నగర్, కోదాడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్ల న్న పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి ఇంకా ఆరురోజులే గడువు ఉండడంతో అభ్యర్థుల తరపున కీలకనేతలు రంగంలోకి దిగారు. మొత్తం 52మంది అభ్యర్థులు బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి,బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకే్షరెడ్డి పోటీ చేస్తున్నారు.
వానాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడే రో గులకు మెరుగైన వైద్య సేవలనందించాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ ఆదేశించారు.
పార్లమెంట్ ఎన్నికల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమం తు కే.జెండగే అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో శనివా రం అధికారులతో సమీక్షించి మాట్లాడారు. లెక్కింపు కేంద్రంలో ఫర్నిచర్, పత్రాల సీలింగ్, వివిధ దశల్లో కావాల్సిన సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు.
వచ్చే నెల 9న గ్రూప్-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం.మహేందర్రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించా రు. కలెక్టరేట్లో శనివారం హైదరాబాద్నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పేకాట శిబిరాల నిర్వహ ణ జోరుగా సాగుతోంది. మాఫియా స్థాయిలో తయారైన నిర్వాహకులు పోలీసుల్లో కొందరిని మచ్చిక చేసుకొని, మరికొందరిని ఏమార్చుతూ పేకాట శిబిరా లు నిర్వహిస్తున్నారు.