Share News

Yadadri: యాదగిరిగుట్టకు పెరిగిన భక్తులరద్దీ

ABN , First Publish Date - 2023-11-19T09:50:59+05:30 IST

యాదాద్రి: కార్తీకమాసం, ఆదివారం కావడంతో యాదగిరిగుట్టకు భక్తులరద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.

Yadadri: యాదగిరిగుట్టకు పెరిగిన భక్తులరద్దీ

యాదాద్రి: కార్తీకమాసం, ఆదివారం కావడంతో యాదగిరిగుట్టకు భక్తులరద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

కాగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య క్షేత్రంలో వైభవంగా కార్తీక మాస సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నారు. కొండ కింద స్వామి వ్రత మండపంలో శనివారం 663 మంది పుణ్య దంపతులు వ్రతాన్ని ఆచరించి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 1.430 మంది బక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారికి 32 లక్షల 33 వేల 553 రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-11-19T09:51:02+05:30 IST