Home » Yadadri Temple
యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మూడో రోజు ఆదివారం అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం శ్రీరామవతార అలంకారంలో నరసింహుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈరోజు సాయంత్రం యాదగిరీషుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
చిలుకూరు బాలాజీ ఆలయం, హిమాయత్నగర్, జూబ్లీహిల్స్లోని టీటీడీ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీని లక్ష మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా పార్కింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. లక్ష్మీనరసింహ స్వామి ధర్మ దర్శనానికి సుమారు 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆషాఢమాసం అయినప్పటికీ సెలవు రోజు కావడంతో సుమారు 30 వేల మంది భక్తులు రాగా.. ప్రత్యేక, ధర్మ దర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (శుక్రవారం) యాదాద్రికి చేరుకున్నారు. యాదగిరి గుట్ట ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం... యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆపై ఆఖండ దీపారాదన చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య ఉన్నారు.
Telangana: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తోపులాటలో చిక్కుకుపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ మంత్రి తోపులాటలో ఇరుక్కుపోవడం చర్చనీయాంశంగా మారింది.
శుక్రవారం మధ్యాహ్నాం 1:30లకు రోడ్డుమార్గాన వలిగొండ మండలం సంగెంకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
తెలంగాణ ఇలవేల్పుగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి రీల్స్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమాన రాజగోపురం స్వర్ణ తాపడానికి విరాళాలు ఇవ్వాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు.
భాగ్యనగర వాసులకు అత్యంత చేరువలో ఉన్న అతి పెద్ద దేవాలయం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. నగరానికి 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయానికి వెళ్లాలంటే రోడ్డు మార్గం ఒక్కటే అందుబాటులో ఉంది. అయితే యాదాద్రికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం శుభవార్త తెలిపారు.