Share News

డెంగ్యూతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2023-11-02T00:31:15+05:30 IST

పట్టణంలోని తాతానగర్‌కు చెందిన పాక సురే్‌షయాదవ్‌ (32) డెంగ్యూతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

డెంగ్యూతో యువకుడి మృతి

భువనగిరి టౌన, నవంబరు 1: పట్టణంలోని తాతానగర్‌కు చెందిన పాక సురే్‌షయాదవ్‌ (32) డెంగ్యూతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. బంధు మిత్రులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రైవేట్‌ ఉద్యోగిగా జీవనం సాగిస్తున్న సురేష్‌ గణేష్‌ నిమజ్జనం రోజు జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఇంట్లోనే ఉంటున్న క్రమంలో మంగళవారం రాత్రి తీవ్ర జ్వరం రావడంతో స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లాడు. అయితే అతనికి డెంగ్యూ సోకి ప్లేట్‌లెట్స్‌ కనిష్ట స్థాయికి పడిపోవడంతో వెంటనే సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రికి తరలిం చారు. కానీ అప్పటికే అతని ఆరోగ్యం మరింత క్షిణించి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. సురే్‌షకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Updated Date - 2023-11-23T07:24:41+05:30 IST