Podem Veeraya: భద్రాచలం కాంగ్రెస్‌ అభ్యర్థిగా పొదెం వీరయ్య ?

ABN , First Publish Date - 2023-09-05T12:08:42+05:30 IST

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్‌ పార్టీ ముమ్మరం చేసింది. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం

Podem Veeraya: భద్రాచలం కాంగ్రెస్‌ అభ్యర్థిగా పొదెం వీరయ్య ?

భద్రాచలం: రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్‌ పార్టీ ముమ్మరం చేసింది. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే పొదెం వీరయ్య(MLA Podem Veeraiah)తో పాటు ఇరువురు ఆశావాహులు టికెట్‌ కోసం దరకాస్తు చేసుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భద్రాచలం మాజీ ఎంపీపీ గొంది బాలయ్య, వాజేడుకు చెందిన పీర్ల కృష్ణబాబు దరఖాస్తు చేసుకోగా ఇందులో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పొదెం వీరయ్య పేరుపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏఐసీసీ సభ్యులుగా, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పొదెం వీరయ్యను భద్రాచలం(Bhadrachalam) అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చే సినట్లు విశ్వసనీయ సమాచారం. భద్రాచలం అభ్యర్ధిగా పొదెం వీరయ్య పేరు అధికారికంగా ప్రకటన చేయడమే మిగిలినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-09-05T12:08:44+05:30 IST