Home » Congress
పోలింగ్ బూత్లోకి మొబైల్ తీసుకునేందుకు అనుమతి ఉండదు. గది బయట ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీ చేస్తుంటారు. అలాంటిది ఓ యువకుడు మొబైల్ తీసుకోవడమే కాదు ఏకంగా వీడియో కూడా తీశాడు. మాములుగా అయితే ఒకసారి ఓటు వేయాలి. అతను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సార్లు ఓటు వేశాడు.
ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యవహారం కాంగ్రెస్లో చిచ్చు రేపుతోంది. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధీర్ చౌదరి వైఖరి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సీరియస్ అయ్యారు...
నెల రోజుల క్రితం మొదలై సుదీర్ఘంగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో అత్యంత కీలకమైన ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. మొత్తం ఏడు దశలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. అతి తక్కువ స్థానాలకు పోలింగ్ జరిగే దశ ఇదే.
దేశంలో నియంత పాలనను తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రజలకు ఏం చేసిందో చెప్పుకోలేక విపక్షాలపై విమర్శలు గుప్పించడం సిగ్గు చేటన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిస్థాయిలో కాపాడుకొని, ఈ ఏడాది వీటిలో నీటిని నిల్వ చేసి, పంపింగ్ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అన్నారం బ్యారేజీని పుణేలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎ్స)తో, సుందిళ్లను జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ)తో పరీక్షలు చేయించడంతో పా టు ఆ బ్యారేజీలు కట్టిన నిర్మాణ సంస్థలతో మరమ్మతులు చేయించనున్నారు.
ఒక రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనుమతిచ్చింది. అయితే, కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసరమైన అంశాలనే చర్చించాలని షరతు విధించింది. ముఖ్యంగా రైతు రుణ మాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను భేటీలో చేపట్టకూడదని పేర్కొంది.
తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాకు 5-10 కిలోలు కోత పెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. కల్లాల వద్ద రైతుల కష్టాలు సర్కారుకు పట్టవా..? అని నిలదీశారు. తరుగుతో సంబంధం లేకుండా మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
శక్తి గ్యారెంటీ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించడంతో మెట్రో ఆదాయం తగ్గిందని ప్రధానిమోదీ వ్యాఖ్యానించడం బాధాకరమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు.
పర్యావరణాన్ని కాపాడేలా భవన నిర్మాణాలు చేపట్టి తెలంగాణలో జీవన విధానం మార్చాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా 50 శాతం నీరు, 40 శాతం విద్యుత్ ఆదా చేసే హరిత నిర్మాణాలకు సర్కారు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ (Congress) పార్టీకి కొత్త బాస్పై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష రేసులో ఎవరు ఉన్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటు ఏ సామాజికవర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుదన్న విషయంపై ఏఐసీసీ కూడా దృష్టి సారించింది.