Share News

ఎన్నికల విధుల్లో పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2023-11-29T00:05:17+05:30 IST

తాండూరు నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పనిచేస్తున్న పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని అడిషనల్‌ ఎస్పీ మురళీధరన్‌ అన్నారు.

ఎన్నికల విధుల్లో పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలి
పోలీసు సిబ్బందికి సలహాలిస్తున్న ఏఎస్పీ మురళీధరన్‌

తాండూరు రూరల్‌, నవంబరు 28: తాండూరు నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పనిచేస్తున్న పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని అడిషనల్‌ ఎస్పీ మురళీధరన్‌ అన్నారు. మంగళవారం కరన్‌కోట్‌ సీసీఐ అతిథి గృహంలో ఎన్నికలవిధుల్లో ఉన్న పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు మొబైల్‌ను పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించరాదని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రానికి 200మీటర్ల దూరం లోపు వాహనాలను అనుమతించొద్దని, జనం గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు కర్ణాటక హోంగార్డులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. సమావేశంలో రూరల్‌ సీఐ రాంబాబు, ఎస్‌ఐ మధుసూదనరెడ్డి, కర్ణాటక పోలీసు అధికారులు, హోం కార్డులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:05:20+05:30 IST