Share News

విద్యార్థులు ధైర్యంతో ముందుకు సాగాలి

ABN , First Publish Date - 2023-11-29T00:18:12+05:30 IST

సాంకేతిక రంగాల్లో రాణించదలచిన విద్యార్ధులు ధైర్యంతో ముందుకు సాగాలని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల కార్యదర్శి త్రిశూల్‌ రెడ్డి అన్నారు.

విద్యార్థులు ధైర్యంతో ముందుకు సాగాలి
హాక్‌థాన్‌ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు

మేడ్చల్‌ టౌన్‌, నవంబరు 28: సాంకేతిక రంగాల్లో రాణించదలచిన విద్యార్ధులు ధైర్యంతో ముందుకు సాగాలని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల కార్యదర్శి త్రిశూల్‌ రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని వ్యాల్యూ లడెన్‌ సంస్థ సహకారంతో నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల్లో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం విద్యార్ధులకు మంగళవారం హాక్‌థాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో మనోధైర్యాన్ని పెంచటానికి విద్యార్ధులు విద్యపై పట్టు సాధించుకోవడానికి హాక్‌థాన్‌ మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు. ప్రతిభకనపరిచిన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ లోకనాథం, కంపూటర్‌ సైన్స్‌ డీన్‌, రామసుబ్బారెడ్డి, డాక్టర్‌ సుజీత్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

Updated Date - 2023-11-29T00:18:13+05:30 IST