అవినీతి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండి
ABN , First Publish Date - 2023-11-29T00:02:42+05:30 IST
అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.
దౌల్తాబాద్, నవంబరు 28: అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మంగళవారం కోస్గిలోని శ్రీలక్ష్మీనర్సింహ కల్యాణ మండపంలో నిర్వహించిన నిరుద్యోగ జేఏసీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలంతా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగామార్చారని ఆరోపించారు. ప్రజలు ఆలోచించి అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ఈ నెల 30న జరిగే పోలింగ్లో చేతి గుర్తుకు ఓటేసి రేవంత్రెడ్డిని గెలిపించాలని కోరారు. సమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి, కొడంగల్ తాలూకా బీసీ సంఘం అధ్యక్షుడు మన్నె బస్వరాజ్యాదవ్, అన్న కిష్టప్ప, నరేందర్, విజయ్కుమార్, శ్రీనివా్సరెడ్డి, వెంకటయ్య, జేఏసీ నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.