Share News

Khammam: కార్పొరేటర్‌ని చంపేస్తామని బెదిరించారు: తుమ్మల

ABN , First Publish Date - 2023-11-19T15:30:19+05:30 IST

కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్ ని అధికార బీఆర్ఎస్ నేతలు చంపేస్తామని బెదిరించారని మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageshwara Rao) సంచలన ఆరోపణలు చేశారు.

Khammam: కార్పొరేటర్‌ని చంపేస్తామని బెదిరించారు: తుమ్మల

ఖమ్మం: కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్ ని అధికార బీఆర్ఎస్ నేతలు చంపేస్తామని బెదిరించారని మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageshwara Rao) సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మంలో ఆర్యవైశ్యుల(Aryavaishya) ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తుమ్మల.. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. "అధికార అహంకారంతో బీఆర్ఎస్ నేతలు ఆర్య వైశ్యులను బెదిరిస్తున్నారు. నలబై ఏళ్ల రాజకీయ జీవితం లో ఆర్య వైశ్యులు నాకు మద్దతు గా నిలిచారు.

వారి ఆత్మ గౌరవం గురించి తెలియని వారు విర్రవీగుతున్నారు. కాంగ్రెస్ లో చేరిన ఓ కార్పొరేటర్ ను చంపేస్తామని బెదిరించారు. ఖమ్మం చరిత్రలో ఏనాడైనా ఇలాంటి అరాచకం చూశామా? నగర అభివృద్ధి పై చర్చకు వచ్చే దమ్ముందా? గోళ్ళపాడు ఛానల్ కాంట్రాక్టర్ ను బెదిరించి రూ.70 కోట్ల పని రూ.170 కోట్ల కు పెంచి దోచుకున్నారు. కాంగ్రెస్ అధికారం లోకి రాగానే ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు నా పూర్తి మద్దతు ఇస్తాం. అరాచకం అవినీతి అక్రమ కేసులు లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్(Congress) పార్టీని గెలిపించాలి" అని కోరారు.

Updated Date - 2023-11-19T15:31:09+05:30 IST