TS News: ఆన్లైన్ గేమింగ్కు యువకుడి బలి
ABN , First Publish Date - 2023-11-23T12:18:33+05:30 IST
ఆన్లైన్ గేమింగ్కు యూత్ బాగా ఎడిక్ట్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యలకు సైతం పాల్పడుతోంది. ఆన్లైన్ గేమింగ్కు నేడు ఓ ఇంటర్ విద్యార్థి బలి అయ్యాడు. ప్రశాంత్ అనే యువకుడు ఆన్లైన్ గేమ్ కోసం ప్రశాంత్ అప్పులు చేశాడు.
వరంగల్ : ఆన్లైన్ గేమింగ్కు యూత్ బాగా ఎడిక్ట్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యలకు సైతం పాల్పడుతోంది. ఆన్లైన్ గేమింగ్కు నేడు ఓ ఇంటర్ విద్యార్థి బలి అయ్యాడు. ప్రశాంత్ అనే యువకుడు ఆన్లైన్ గేమ్ కోసం ప్రశాంత్ అప్పులు చేశాడు. అయితే అప్పులు తీర్చే మార్గం లేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సంపేట బిట్స్ కళాశాలలో ప్రశాంత్ ఇంటర్ చదువుతున్నారు. నర్సంపేట మాదనపేట్ రోడ్డులోని ఇంటి దగ్గర ఆత్మహత్యకు పాల్పడ్డాడు.