Share News

TDP: ‘రా కదలిరా’ సభను అడ్డుకోవడనుకోవడం పిరికిపంద చర్య..

ABN , Publish Date - Feb 15 , 2024 | 10:40 AM

Andhrapradesh: పర్చూరులో జరిగే ‘‘రా కదలిరా’’ సభను అడ్డుకోవాలని చూడడం పిరికిపంద చర్య అని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల సభలను అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమన్నారు.

TDP: ‘రా కదలిరా’ సభను అడ్డుకోవడనుకోవడం పిరికిపంద చర్య..

అమరావతి, ఫిబ్రవరి 15: పర్చూరులో జరిగే ‘‘రా కదలిరా’’ సభను అడ్డుకోవాలని చూడడం పిరికిపంద చర్య అని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల సభలను అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమన్నారు. సైకో ఇజానికి ఇది ఒక నిదర్శనమన్నారు. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఇప్పటి వరకు 20 రా కదలిరా సభలు నిర్వహించారన్నారు. 21వ సభను పోలీసుల ద్వారా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన 17వ తేదీన అనుకున్న ప్రదేశంలోనే రా కదలిరా సభ జరుగుతుందని స్పష్టం చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) పర్యటనకు హెలికాప్టర్ అనుమతి నిరాకరించడం ఒక దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 15 , 2024 | 10:40 AM