Share News

Road Accident: కారును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.. నలుగురి మృతి

ABN , Publish Date - Jul 06 , 2024 | 07:47 AM

ఇవాళ తెల్లవారుజామున అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురిని పొట్టన బెట్టుకుంది. పొద్దుటే వాహన డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడో ఏమో కానీ ఓ కారుని ఢీకొట్టాడు.

Road Accident: కారును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.. నలుగురి మృతి

అన్నమయ్య జిల్లా: ఇవాళ తెల్లవారుజామున అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురిని పొట్టన బెట్టుకుంది. పొద్దుటే వాహన డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడో ఏమో కానీ ఓ కారుని ఢీకొట్టాడు. దీంతో ఘోర ప్రమాదం జరిగింది. రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. ఆ వాహనం ఎవరిది? ఏంటనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 06 , 2024 | 08:06 AM