Share News

VIGILENCE DSP: అభివృద్ధి పనుల తనిఖీ

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:24 AM

జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అటవీశాఖ అభివృద్ధి పనులపై విజిలెన్స డీఎ్‌ఫఓ రవిశంకర్‌ శర్మ, ఎఫ్‌ఆర్‌ఓ శంకరయ్య త మ బృందంతో కలిసి తనిఖీలు చేపట్టారు.

VIGILENCE DSP: అభివృద్ధి పనుల తనిఖీ
Vigilance DFO Sharma inspecting development work in Anantapur range

అనంతపురం న్యూ టౌన, జూలై 26: జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అటవీశాఖ అభివృద్ధి పనులపై విజిలెన్స డీఎ్‌ఫఓ రవిశంకర్‌ శర్మ, ఎఫ్‌ఆర్‌ఓ శంకరయ్య త మ బృందంతో కలిసి తనిఖీలు చేపట్టారు. గురువారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన కళ్యాణదుర్గం రేంజ్‌లోని పలు ప్రాంతాల్లో తనిఖీ చేపట్టి అభివృద్ధి పనులను పరిశీలించినట్లు డీఎ్‌ఫఓ వినీత కుమార్‌ తెలిపారు. కళ్యాణదుర్గం రేంజ్‌లో ఏర్పాటు చేయనున్న నగరవనాలతో పాటు రేంజ్‌ పరిధిలోని పలు నర్సరీలు, ప్లాంటేషనతో పాటు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించినట్లు తెలిపారు. అందులో భాగంగానే శుక్రవారం అనంతపురం రేంజ్‌ పరిధిలోని మరుట్ల సౌత, నార్త్‌ బీట్స్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిపారు. అక్కడి నుంచి గుత్తి రేంజ్‌లోని పందికుంట బీట్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలనకు వెళ్లారన్నారు. తనిఖీల్లో రేంజర్‌ శ్రీనివాసులు, డీఆర్వో ఉసేనప్ప, సెక్షన ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎఫ్‌బీఓ నీలవేణి పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:24 AM