Home » Anantapur urban
ఉమ్మడి జిల్లాకు తాగునీరు అందించే శ్రీరామిరెడ్డి, సత్యసాయి శుద్ధి కేంద్రాలు బంద్ కావడంతో గ్రామాల్లో ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. నీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని 11 రోజులుగా సమ్మె బాట పట్టడంతో గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి.
ఉపాధ్యాయులకు నెలవారీ ఉద్యోగోన్నతులు ఇవ్వాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాయల్ వెంకటేశ్వర్లు, ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన డిమాండ్ చేశారు. సోమవారం ఆ సంఘం జోనల్ కార్యదర్శి సతీ్షకుమార్ అధ్యక్షతన ఉపాధ్యాయభవనలో సమావేశం నిర్వహించారు.
మినీ లెదర్ పరిశ్రమను ప్రారంభించి దళిత కుటుంబాల్లోని యవతకు ఉపాధి కల్పిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. శుక్రవారం శింగనమల మండలంలోని రాచేపల్లి వద్ద మూతపడ్డ మినీ లెదర్ పరిశ్రమను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు.
ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పెంచుకోవాలని జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి సూచించారు. శుక్రవారం కళాశాల ఎనఎ్సఎ్స యూనిట్-3 ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
భూగర్బ జలాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫారంపాండ్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. కూటమి ప్రభుత్వం అధికరంలోకి వచ్చాక జిల్లాలో మొదటిసారిగా రాప్తాడు మండలం హంపాపురం, గొందిరెడ్డిపల్లి, రామినేపల్లి గ్రామాల్లో ఫారంపాండ్లు మంజూరయ్యాయి.
ఉపాధ్యాయులకు మధ్యంతర భృతి 30 శాతం వెంటనే ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి డిమాండ్ చేశారు.
కడపలో జిల్లా విద్యాశాఖ సిబ్బందిపై కొందరు ఉపాధ్యాయ సంఘం నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని జిల్లా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది ఖండించారు. గురువారం డీఈఓ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు.
ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని సీపీఎం ఒకటవ నగర కమిటీ కార్యదర్శి రామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అనంతపురం అర్బన తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో కార్డుదారులతో కలసి చేపట్టిన ధర్నాకు ఆయన హాజరై మాట్లాడారు.
వైసీపీ పాలనలో అభివృద్ధిని అటకెక్కించిందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు. గురువారం మండలంలోని ఎ.నారాయాణపురం పంచాయతీ తపోవనంలో సీసీరోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే హాజరై స్థానిక నాయకులు, అధికారులతో కలసి భూమి పూజ చేశారు.
తమను రెగ్యులర్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ స్టాఫ్నర్సులు చేపడుతున్న ఉద్యమం ఊపందుకుంది. రెండురోజులుగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు బహిష్కరించి నిరసనలు కొనసాగిస్తున్నారు.