Share News

NAARASIMHA : నమో నారసింహ..!

ABN , Publish Date - May 26 , 2024 | 12:20 AM

పెన్నహోబిలం లక్ష్మీనరసింహాస్వామి శనివారం హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహోత్సవాలలో భాగంగా ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాతసేవ, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి ...

NAARASIMHA : నమో నారసింహ..!
Narasimha riding on the vehicle of Hanuman

పెన్నహోబిలం లక్ష్మీనరసింహాస్వామి శనివారం హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహోత్సవాలలో భాగంగా ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాతసేవ, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి హనుమంతవాహనంపై కొలువుదీర్చి.. ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతపురం శాంతి టాకీస్‌ యజమాని గుర్రం సుధాకర్‌, రవీంద్రనాథ్‌ ఉత్సవ ఉభయదాతలుగా వ్యవహరించారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి ఆదివారం గరుడవాహనోత్సవం, కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

- ఉరవకొండ

Updated Date - May 26 , 2024 | 12:20 AM