Home » Districts
జిల్లా అటవీశాఖలో జరిగిన అక్రమాలపై ఏపీసీసీఎఫ్( అడిషినల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) ఆర్కే సుమన సోమవారం ఆరా తీశారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కేంద్రానికి వచ్చారు. సీసీఎఫ్ నాగేశ్వరరావుతో కలిసి అనంతపురం ఉమ్మడి జిల్లాతో పాటు, చిత్తూరు జిల్లా డీఎ్ఫఓలతో సమావేశమయ్యారు. శాఖ పరమైన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గుమస్తాలకు సంబంధించి ..
ఖరీఫ్ విత్తన సాగుకు మృగశిర కార్తె తరువాత పునర్వసు అనుకూలమని రైతులు విశ్వసిస్తారు. ఈ కార్తెలో విత్తనం వేస్తే మంచి దిగుబడి వస్తుందని అంటారు. ఈనెల 21తో మృగశిర కార్తె ముగిసింది. ఆలోగా పదును వర్షాలు కొన్ని ప్రాంతాల్లోనే పడ్డాయి. దీంతో 5,800 హెక్టార్లలో పంట సాగైంది. పునర్వసు కార్తె వచ్చే నెల 5న మొదలౌతుంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఈనెల ఆరంభంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో దుక్కి దున్ని.. పొలాలను సిద్ధం చేసుకున్నారు. వేరుశనగ, కంది తదితర విత్తనాలను సైతం తగినన్ని సమకూర్చుకున్నారు. ఒక్క తడి ...
జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు లేకుండా గట్టి చర్యలు చేపట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి కమిటీతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో డ్రగ్స్ రవాణా, గంజాయి సాగు, రవాణా కాకుండా చూడాలని అన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు వినియోగించకుండా విద్యాలయాలలో అవగాహన కార్యక్రమాలు...
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అధికారులు కూడా మారిపోతున్నారు. కానీ గృహనిర్మాణ శాఖలో మాత్రం కొందరు అధికారులు ఇంకా వైసీపీ సేవలో తరిస్తున్నారు. జగనన్న ఇళ్ల లబ్ధిదారుల విషయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకా్షరెడ్డికి చెందిన రాక్రీట్ సంస్థ గుట్టుగా వ్యవహారం నడిపిస్తోంది. లబ్ధిదారులపై ఒత్తిడి చేసి ఉపాధి బిల్లులు వసూలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆదేశాలను ఆ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికీ పాటిస్తున్నారు. ఏమాత్రం ఆలోచన చేయకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉద్యోగులను గ్రూపులుగా విభజించి మరీ వసూళ్లకు ఉసిగొల్పుతున్నారని సమాచారం. ...
కోటంక సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. తలుపులు పగులగొట్టి రూ.7.80 లక్షలు విలువైన బంగారు, వెండి అభరణలను ఎత్తుకుపోయారు. గ్రామ సమీపంలోని గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఏటా మాఘమాసంలో నాలుగువారాలు పాటు స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి ఆదివారం స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇంతటి ప్రఖ్యాత ఆలయంలో చోరీ జరగడం కలకలం రేపింది. ఆలయ ప్రధాన ద్వారాలను ఇనుప రాడ్లతో ద్వంసం ...
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన సీడీ ఆస్పత్రిలో ప్రజలకు సరైన వైద్య సేవలు అందకుండా పోతున్నాయి. అప్పటి పాలకులకు భవనాల నిర్మాణం, ప్రారంభంపై ఉన్న శ్రద్ధ సిబ్బంది నియామకంపై లేకపోవడంతో నగర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందకుండా పోయాయి. మూడు వందల మందికి పైగా ఉండే ఓపీని కేవలం ఇద్దరు వైద్యులే చూడాల్సి వస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. వచ్చిన యంత్రాలు కూడా టెక్నీషియన లేకపోవడంతో మూలకు చేరాయి. ఇలా కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ ఆస్పత్రి పరిస్థితి సిబ్బంది కొరతతో అగమ్యగోచరంగా మారింది. ...
కరువు పరిస్థితిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం వచ్చింది. రబీ సీజనలో వర్షాభావం కారణంగా వివిధరకాల పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం జిల్లాలో 37,195 హెక్టార్లల్లో రూ.36.86 కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారు. ఇందులో అత్యధికంగా 34,303 హెక్టార్లల్లో పప్పుశనగ పంట దెబ్బతింది. దీని విలువ రూ.34.30 కోట్లు. ఇది కాకుండా మినుము, పెసర, ఉలవ, జొన్న, నువ్వులు, తెల్లకుసుమ, పొద్దుతిరుగుడు, అలసంద, కొర్ర తదితర పంటలు దెబ్బతిన్నాయి. ...
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే ఐదు హామీల అమలుకు చంద్రబాబు సంతకాలు చేయడంతో టీడీపీ జిల్లా కార్యాలయంలో నాయకులు సంబరాలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తదితరులు చంద్రబాబు చిత్రపటానికి శనివారం క్షీరాభిషేకం చేశారు. వృద్ధులు, మహిళలకు స్వీట్లు తినిపించారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. కూటమి ఘన విజయం సాధించి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఏపీ ...
పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి వారిని కలెక్టర్ వినోద్కుమార్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు మేళతాళాలతో స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో కలెక్టర్...
కూటమి విజయంతో వైసీపీతో అంటకాగిన అధికారుల్లో గుబులు మొదలైంది. నియోజకవర్గంలోని వివిధ శాఖల్లో ఐదేళ్ల పాటు వైసీపీకి కొమ్ముకాసిన సుమారు 55 మంది అధికారులు తట్టాబుట్టా సర్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బదిలీ ప్రయత్నాలను ప్రారంభించారు. వీరిలో మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీసు, ట్రాన్సకో తదితర శాఖల అధికారులు, ఎంపీడీఓ కార్యాలయాల అధికారులు, పంచాయతీ రాజ్ కార్యాలయ అధికారులు ఉన్నారు. వైసీపీ పాలనలో వీరందరూ ఆ పార్టీ నాయకులకు వంత పాడుతూ పబ్బం ...