Share News

PENNA AHOBILAM : కన్నుల పండువగా నారసింహుడి కల్యాణం

ABN , Publish Date - May 27 , 2024 | 12:25 AM

మండలలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి సుప్రభాతసేవ, అభిషేకాలు, అర్చన, నిత్యహోమాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకు ...

PENNA AHOBILAM : కన్నుల పండువగా నారసింహుడి కల్యాణం
Kalyanotsavam Ice Being Held The Press

ఉరవకొండ, మే 26: మండలలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి సుప్రభాతసేవ, అభిషేకాలు, అర్చన, నిత్యహోమాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకు వచ్చారు. ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలతో అందంగా అలంకరించారు. వేద


పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

గరుడవాహనంపై ఊరేగిన స్వామివారు

బ్రహ్మోత్సవాలలో భాగంగా లక్ష్మీనరసింహస్వామి ఆదివారం రాత్రి గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ మూర్తులను మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. ఆలయం చుట్టూ ఉత్సవ మూర్తులను ఊరేగించారు. బొల్లినేని కుటుంబసభ్యులు ఉత్సవ ఉభయదాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఈవో విజయ్‌ కుమార్‌, అర్చకులు ద్వారకానాఽథాచార్యులు, సిబ్బంది మారుతీ, దీపక్‌ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా లక్ష్మీనరసింహస్వామికి సోమవారం సూర్యప్రభవాహనోత్సవం, ఐరావతవాహనోత్సవం నిర్వహించనున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 27 , 2024 | 12:25 AM