Share News

TDP : ఊరూ వాడా సంబరం

ABN , Publish Date - Jun 13 , 2024 | 12:09 AM

టీడీపీ అధినేత, ఎన్డీఏ శాసన సభాపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో జిల్లా ప్రజలు పండుగ చేసుకున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కేక్‌లు కట్‌ చేశారు. మిఠాయిలు పంచిపెట్టారు. ఎన్టీఆర్‌ విగ్రహాలకు, చంద్రబాబు...

TDP : ఊరూ వాడా సంబరం
Cake cutting in front of Anantapur Ambedkar statue.. Celebrations..

పండుగను తలపించిన ప్రమాణ స్వీకారోత్సవం

ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లలో వేడుకల వీక్షణం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు జై కొడుతూ చిందులు

నేతల విగ్రహాలు, చిత్రపటాలకు క్షీరాభిషేకం

టీడీపీ అధినేత, ఎన్డీఏ శాసన సభాపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో జిల్లా ప్రజలు పండుగ చేసుకున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కేక్‌లు కట్‌ చేశారు. మిఠాయిలు పంచిపెట్టారు. ఎన్టీఆర్‌ విగ్రహాలకు, చంద్రబాబు, పవన కల్యాణ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బాణసంచా పేల్చి చిందులు వేశారు. పసుపు రంగులు చల్లుకున్నారు. ఆలయాల్లో పూజలు నిర్వహించి.. మొక్కులు తీర్చుకున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించడంతో శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.



నూటొక్క టెంకాయ

పుట్లూరు: మండల పరిధిలోని చింతకుంట గ్రామంలో భైరవస్వామి, ఎస్సీ కాలనీ పెద్దమ్మ ఆలయాల్లో టీడీపీ నాయకులు నూటొక్క కొబ్బరికాయలు కొట్టారు. శింగనమల ఎమ్మెల్యేగా బండారు శ్రావణిశ్రీ, అనంత ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణ గెలవడంతో మొక్కు తీర్చుకున్నారు. పార్టీ నాయకులు భైరవేశ్వర్‌రెడ్డి, కృష్ణకాంత, సుధ, చందు, వెంకటరామిరెడ్డి, నాగరాజు, బాల కొండయ్య, ప్రసాద్‌, మనోహర్‌, నరేష్‌, గిరివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 13 , 2024 | 12:09 AM