Share News

Quality food విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:02 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నా ణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని డిప్యూటీ డీఈఓ నాగరాజు సూచించారు. మండలంలోని కల్యం గ్రామ జిల్లా పరిషత ఉన్న త పాఠశాల, మండల పరిషత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు.

 Quality food విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి
విద్యార్థులతో మాట్లాడుతున్న డిప్యూటీ డీఈఓ నాగరాజు

- డిప్యూటీ డీఈఓ నాగరాజు సూచన

డీ.హీరేహాళ్‌, జూలై 26: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నా ణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని డిప్యూటీ డీఈఓ నాగరాజు సూచించారు. మండలంలోని కల్యం గ్రామ జిల్లా పరిషత ఉన్న త పాఠశాల, మండల పరిషత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు.


భోజనాలు ఎలా ఉ న్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మధ్యాహ్నభోజన ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. ఈ విషయంలో ఎటువంటి పొరబాట్లు జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్రామస్థుల కోరిక మేరకు ఈ పాఠశాలల విలీనంపై నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తానని ఆయన తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం

Updated Date - Jul 27 , 2024 | 12:02 AM