క్రికెట్ టోర్నీ విజేత కొత్తపేట
ABN , Publish Date - Jul 27 , 2024 | 12:16 AM
స్థానిక ఆర్డీటీ క్రీడామైదానంలో నాలుగు రోజులుగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో కొత్తపేట మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల జట్టు విజయం సాధించినట్లు ఆ పాఠశాల హెచఎం పద్మావతి, పీడీ పద్మబాయ్ తెలిపారు.
ధర్మవరం, జూలై 26 : స్థానిక ఆర్డీటీ క్రీడామైదానంలో నాలుగు రోజులుగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో కొత్తపేట మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల జట్టు విజయం సాధించినట్లు ఆ పాఠశాల హెచఎం పద్మావతి, పీడీ పద్మబాయ్ తెలిపారు. ఆ క్రీడాకారుల కు నగదు బహుమతి అందజేసినట్లు తెలిపారు. కబడ్డీ పోటీల్లోనూ తమ పాఠశాల విద్యార్థులు రన్నర్గా నిలిచారన్నారు. ఆ విద్యార్థులను శుక్రవారం అభినందించా రు. కార్యక్రమంలో సీనియర్ ఉపాఽధ్యాయుడు గోరకాటి పెద్దారెడ్డి పాల్గొన్నారు.