Share News

కార్గిల్‌ అమరవీరులకు నివాళి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:12 AM

కార్గిల్‌ యుద్ధంలో అమలైన సైనికులకు స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాల శుక్రవారం పలువురు నివాళులర్పిం చారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పట్టణంలోని ఎనసీసీ విద్యార్థులు ర్యాలీ నిర్వ హించారు.

కార్గిల్‌ అమరవీరులకు నివాళి
లోచర్లలో వంద మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్థుల ర్యాలీ

కదిరిఅర్బన, జూలై 26: కార్గిల్‌ యుద్ధంలో అమలైన సైనికులకు స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాల శుక్రవారం పలువురు నివాళులర్పిం చారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పట్టణంలోని ఎనసీసీ విద్యార్థులు ర్యాలీ నిర్వ హించారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ స్మిత మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దేశభక్తి పెంపొందించు కోవాలన్నారు. ఓబులేసు డిఫెన్స ఆకాడమి ఆధ్వర్యంలో కార్గిల్‌ విజయ్‌దివస్‌ నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి అమవీరులకు జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు హైదర్‌వలీ, శంకర్‌, ఎనసీసీ ఇనచార్జి చెన్నారెడ్డి, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.


కొత్తచెరువు: మండలంలోని లోచర్ల గ్రామంలో కార్గిల్‌ అమర వీరులకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు, టీడీపీ, జనసేన నాయకులు శుక్రవారం నివాళులర్పించారు. ముందుగా విద్యార్థులు వంద మీటర్ల జాతీయ పతాకంతో ఆ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

Updated Date - Jul 27 , 2024 | 12:12 AM