CODE : యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన
ABN , Publish Date - May 09 , 2024 | 12:19 AM
ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎక్కడైనా ఏ చిన్న ఘటన జరిగినా కోడ్ అమలులో ఉందని అధికారులు చె బుతారు. కానీ వైసీపీ నాయకులు యథేచ్ఛగా ఇళ్ల వద్దకు వెల్లి సిద్ధం స్టిక్కర్లు అతికిస్తున్నా పట్టించుకున్న పాపనపోలేదు. హిందూపురం పట్టణ పరిధిలోని 30, 31 వార్డుల్లో కొంతమంది వార్డు వలంటీర్లు సిద్ధం స్టిక్కర్లు, వాల్ పోస్టర్లు తీసుకెళ్లి ఇళ్లకు అతికిస్తున్నారు. ఈ క్యాలెండర్లో కలలు నిజం చేయడానికి జగన కోసం సిద్ధం అంటూ ఉంది. అలాగే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకోవడం కాదు మీ పిల్లల భవిష్యత్తును నిర్ణయించేందుకే ఫ్యాన గుర్తుకు ఓటే యా లని చెబుతూ స్టిక్కర్లను అతికిస్తూ వెళ్తున్నారు.
వార్డుల్లో, పల్లెల్లో సిద్ధం స్టిక్కర్ల అతికింపు
చోద్యంచూస్తున్న ఫ్లయింగ్స్క్వాడ్
పట్టించుకోని ఎన్నికల అధికారులు
హిందూపురం, మే 8: ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎక్కడైనా ఏ చిన్న ఘటన జరిగినా కోడ్ అమలులో ఉందని అధికారులు చె బుతారు. కానీ వైసీపీ నాయకులు యథేచ్ఛగా ఇళ్ల వద్దకు వెల్లి సిద్ధం స్టిక్కర్లు అతికిస్తున్నా పట్టించుకున్న పాపనపోలేదు. హిందూపురం పట్టణ పరిధిలోని 30, 31 వార్డుల్లో కొంతమంది వార్డు వలంటీర్లు సిద్ధం స్టిక్కర్లు, వాల్ పోస్టర్లు తీసుకెళ్లి ఇళ్లకు అతికిస్తున్నారు. ఈ క్యాలెండర్లో కలలు నిజం చేయడానికి జగన కోసం సిద్ధం అంటూ ఉంది. అలాగే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకోవడం కాదు మీ పిల్లల భవిష్యత్తును నిర్ణయించేందుకే ఫ్యాన గుర్తుకు ఓటే యా లని చెబుతూ స్టిక్కర్లను అతికిస్తూ వెళ్తున్నారు.
కొన్నిచోట్ల ఇళ్లలోకి వెళ్లి స్టిక్కర్, క్యాలెండర్ ఇచ్చి వెళుతున్నారు. అదేవిధంగా చిలమత్తూరులో అధికార పార్టీ ఎంపీపీ పురుషోత్తంరెడ్డి ఇంటింటికి వెళ్లి సిద్ధం స్టిక్కర్లు అతి కించారు. చర్యలు తీసుకోవాల్సిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చోద్యం చూస్తున్నారు కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వీటిని పట్టించుకోవాల్సిన అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో వైసీపీ నాయకులు సిద్ధం స్టిక్కర్లు యథేచ్ఛగా అతికిస్తూ వెళుతున్నారు. దీనిపై చిలమత్తూరు ఎంపీడీఓ, పురం మునిసిపల్ కమిషనర్కు టీడీపీ లీగల్సెల్ అధ్యక్షుడు శివశంకర్ ఫిర్యాదు చేశారు.
పెనుకొండ రూరల్: మండలంలో ఎన్నికల నిబంధనలు అమలు కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పెనుకొండ నగర పంచా యతీ మంగాపురంలో బలవంతంగా వైసీపీ నాయకులు ఇళ్లకు జగన స్టిక్కర్లు అతికించారు. వాటిని బుధవారం టీడీపీ నాయకులు తొల గించారు. పెనుకొండ మండలంలో ఎన్నికల నిబంధనలు వైసీపీ నాయకులు పాటించడం లేదని టీడీపీ నాయకులు విమర్శించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....