Share News

ముస్లిం మైనార్టీల్లో విషబీజాలు నాటుతున్న వైసీపీ

ABN , Publish Date - May 09 , 2024 | 12:32 AM

ముస్లిం మైనార్టీలంతా టీడీపీతోనే ఉన్నారన్న అక్కసుతో ఆ వర్గాల్లో వైసీపీ విషపు బీజాలు నాటుతోందని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ మండిపడ్డారు.

ముస్లిం మైనార్టీల్లో విషబీజాలు నాటుతున్న వైసీపీ
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌

అనంతపురం అర్బన, మే 8: ముస్లిం మైనార్టీలంతా టీడీపీతోనే ఉన్నారన్న అక్కసుతో ఆ వర్గాల్లో వైసీపీ విషపు బీజాలు నాటుతోందని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ మండిపడ్డారు. బుధవారం స్థానిక శ్రీనగర్‌ కాలనీలోని అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ముస్లిం మైనార్టీల ద్రోహి సీఎం జగన అంటూ ధ్వజమెత్తారు. ఐదేళ్లపాటు బీజేపీతో అంటకాగి... ఇప్పుడు టీడీపీపైనే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగనపై ఉన్న 32 కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ ఏం చేసినా ఆయన వంతపాడారన్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన సీఏఏతో పాటు ఇతర చట్టాలకు అడగకపోయినా జగన మద్దతునిచ్చారని గుర్తు చేశారు. జగన నమ్మొద్దని మైనార్టీల వర్గాలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునఃనిర్మాణం, అభివృద్ధికి చంద్రబాబునాయుడు నాయకత్వం చాలా అవసరమన్నారు. ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా లేద న్నారు. టీడీపీ అధికారరంలోకి రాగానే ముస్లిం, మైనార్టీలకు గతంలో అందించిన అన్ని పథకాలను పునరుద్ధరిస్తామన్నారు. ముస్లిం, మైనార్టీలంతా ఏకమై కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు సైఫుద్దీన, ఇస్మాయిల్‌, ఉమర్‌, బాబాఫకృద్దీన పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:32 AM