Share News

EC: ఏపీలో ఈ నియోజకవర్గంలోనే పోలింగ్ ఎక్కువ..తక్కువ ఎక్కడంటే

ABN , Publish Date - May 15 , 2024 | 02:48 PM

ఏపీ(AP)లో ఇటివల జరిగిన అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల అంశంపై సీఈవో ముఖేశ్ కుమార్(Mukesh Kumar Meena) మీడియా సమావేశంలో భాగంగా కీలక విషయాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో గతంలో కంటే ఈసారి ఏపీలో అత్యధికంగా పోలింగ్(polling) శాతం నమోదైనట్లు వెల్లడించారు.

EC: ఏపీలో ఈ నియోజకవర్గంలోనే పోలింగ్ ఎక్కువ..తక్కువ ఎక్కడంటే
AP Chief Electoral Officer Mukesh Kumar Meena

ఏపీ(AP)లో ఇటివల జరిగిన అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల(ap elections 2024) అంశంపై సీఈవో ముఖేశ్ కుమార్(Mukesh Kumar Meena) మీడియా సమావేశంలో భాగంగా కీలక విషయాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో గతంలో కంటే ఈసారి ఏపీలో అత్యధికంగా పోలింగ్(polling) శాతం నమోదైనట్లు వెల్లడించారు. ఈ క్రమంలో 2024లో 81.6 శాతం ఓటింగ్ శాతం నమోదైనట్లు చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 2.09 శాతం ఓటింగ్ పెరిగిందన్నారు. ఈ క్రమంలో 2014లో 78.41 శాతం పోలింగ్ నమోదు కాగా, 2019లో 79.77 శాతం రికార్డైనట్లు తెలిపారు.


ఈ నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలో 90.91 శాతంతో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కాగా, తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32 శాతం రికార్డైనట్లు చెప్పారు. ఇక ఓటింగ్ పూర్తైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో ఈవీఎంలను భద్రపరిచామని ఈసీ తెలిపారు. దీంతోపాటు సెక్యూరిటీని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో 350 స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశామని, రెండు రకాల స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలు(evms) భద్రపరిచినట్లు ఈసీ చెప్పారు. అంతేకాదు మూడు విధాలుగా ఈవీఎంల స్ట్రాంగ్ రూముల భద్రతను మానిటరింగ్ చేస్తున్నట్లు ఈసీ ముఖేశ్ కుమార్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: అంతలోనే మాట మారింది..?

TS News: కామారెడ్డి డీఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

Read Latest AP News And Telugu News

Updated Date - May 15 , 2024 | 02:52 PM