Share News

Chandrababu: నేటి నుంచి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు

ABN , Publish Date - Jul 04 , 2024 | 07:22 AM

నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10.15 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం 9 గంటలకు వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో చంద్రబాబు భేటీ జరగనుంది. 12.15 గంటలకు కేంద్రమంత్రి మంత్రి నితిన్ గడ్కరీ, 2 గంటలకు వ్యవసాయ, గ్రామాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్.. 2.45 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు.

Chandrababu: నేటి నుంచి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు

ఢిల్లీ: నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం 10.15 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం 9 గంటలకు వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో చంద్రబాబు భేటీ జరగనుంది. 12.15 గంటలకు కేంద్రమంత్రి మంత్రి నితిన్ గడ్కరీ, 2 గంటలకు వ్యవసాయ, గ్రామాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్.. 2.45 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు.


శుక్రవారం ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం,10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, 10.45 కి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, 12.30 కేంద్ర మంత్రి అథవాలేతో భేటీ కానున్నారు. తరువాత పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ రాయబారితో చంద్రబాబు సమావేశం కానున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి చంద్రబాబు హైదరాబాద్ తిరిగి వెళ్లనున్నారు.

Updated Date - Jul 04 , 2024 | 07:37 AM