Share News

తిరుమలలో టాటా గ్రూప్స్‌ చైర్మన్‌

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:30 AM

టాటా గ్రూప్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ శ్రీవారి దర్శనార్థం గురువారం తిరుమలకు వచ్చారు.

తిరుమలలో టాటా గ్రూప్స్‌ చైర్మన్‌

తిరుమల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): టాటా గ్రూప్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ శ్రీవారి దర్శనార్థం గురువారం తిరుమలకు వచ్చారు. పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికి కాసేపు మాట్లాడారు. తిరుపతిలోని టాటా క్యాన్సర్‌ ఆస్పత్రి పనులపై చర్చించారు. ఆయనతో పాటు టీసీఎస్‌ ప్రెసిడెంట్‌ రాజన్న ఉన్నారు. కాగా, చంద్రశేఖరన్‌ శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Updated Date - Jul 05 , 2024 | 05:30 AM