Share News

కార్యకర్తలను కాపాడుకోవాలి: చంద్రబాబు

ABN , Publish Date - Jun 18 , 2024 | 05:49 AM

ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పార్టీతో ఉండేది కార్యకర్తలే..వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

కార్యకర్తలను కాపాడుకోవాలి: చంద్రబాబు

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): ‘ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పార్టీతో ఉండేది కార్యకర్తలే..వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఉండవల్లి నివాసంలో టీడీపీ లీగల్‌ సెల్‌ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ప్రభుత్వమే దారుణాలకు పాల్పడటం, రౌడీయిజం చేయడం వైసీపీ హయాంలోనే చూశాం. ఐదేళ్లలో వైసీపీ అరాచకాలను ఎదుర్కొన్న కార్యకర్తలపై కేసులు పెట్టి, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ఈ అక్రమ కేసులపై లీగల్‌ సెల్‌ రేయింబవుళ్లు కష్టపడి, కార్యకర్తలకు అండగా నిలిచింది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అనేక పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఈ పోరాటంలో టీడీపీ లీగల్‌ సెల్‌ చేసిన కృషి ప్రశంసనీయం’ అని కొనియాడారు.

Updated Date - Jun 18 , 2024 | 05:49 AM